ఏపీలో కేసీఆర్‌ సర్వే...జగన్‌తో కేటీఆర్‌ భేటీ తర్వాత...

కేసీఆర్‌ ఏది చేసిన పక్కా ప్లాన్‌ ఉంటుంది. ముందస్తు వ్యూహంతోనే జగన్‌తో దోస్తీకి రాయభారం నడిపినట్టు తెలుస్తోంది.

Update: 2019-01-18 07:32 GMT
KCR

కేసీఆర్‌ ఏది చేసిన పక్కా ప్లాన్‌ ఉంటుంది. ముందస్తు వ్యూహంతోనే జగన్‌తో దోస్తీకి రాయభారం నడిపినట్టు తెలుస్తోంది. చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తానని ప్రకటించిన కేసీఆర్‌ ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టేముందు జగన్‌తో చర్చలు జరిపి టీడీపీకి షాకిచ్చారు. అయితే, జగన్‌తో కేటీఆర్‌ భేటీని ఏపీవాసులు ఎలా స్వీకరిస్తున్నారో తెలుసుకోవాలని కేసీఆర్‌ భావిస్తున్నారు.

ఏపీ ప్రజల నాడి తెలుసుకునేందుకే కేసీఆర్‌ ముందుగా కేటీఆర్‌ను జగన్‌ దగ్గరికి పంపించారు. జగన్‌తో కేటీఆర్‌ భేటీని ఏపీ వాసులు పాజిటివ్‌గా తీసుకుంటారా? లేక ఇక ఈ భేటీ వైసీపీకి మైనస్‌ అవుతుందా అన్నదానిపై సర్వే చేయిస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీ ప్రజల నాడిని బట్టి కేసీఆర్‌ నెక్ట్స్‌ స్టెప్‌ వేయబోతున్నారు. 

Similar News