ఇద్దరికీ కీలక పదవులు

Update: 2019-05-29 10:21 GMT

టీడీపీ శానససభాపక్ష నేతగా ఎన్నికైన చంద్రబాబు ఈరోజు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గుంటూరు లోక్ సభ సభ్యుడు గల్లా జయదేవ్ ను టీడీపీ పార్లమెంటరీ నేతగా చంద్రబాబు నియమించారు. అలాగే శ్రీకాకుళం లోక్ సభ సభ్యుడు కె.రామ్మోహన్ నాయుడిని లోక్ సభలో టీడీపీ ఫ్లోర్ లీడర్ గా ఖరారు చేశారు. రాజ్యసభలో టీడీపీ ఫ్లోర్ లీడర్ గా సుజనా చౌదరిని ఎంపిక చేశారు. త్వరలో విజయవాడ నుంచి టీడీపీ రాష్ట్ర స్థాయి పూర్తి కార్యకలాపాలు జరగనున్నాయి. బెజవాడలో పార్టీ కార్యాలయం కోసం తాత్కాలిక భవనం చూడాలని నాయకులకు చంద్రబాబు సూచించారు. కొత్త పార్టీ ఆఫీసు నుంచే ప్రతి రోజు పార్టీ కార్యకలాపాలు చంద్రబాబు నిర్వహించనున్నారు.  

Similar News