టీడీపీ ఎంపీ రామ్మో హన్ నాయుడు మోడీ సర్కార్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని లోక్సభలో వివరించారు. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అనే నినాదం కేవలం మాటలకే పరిమితం అయిందని ఎద్దేవా చేశారు. రైల్వే జోన్ హామీని కేంద్రం తుంగలో తొక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వేజోన్పై ఇప్పటి వరకూ ఒక్క ప్రకటన కూడా లేదని రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు.