తన వారసురాలిగా తన కూతురు షబానా వచ్చే ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ఎమ్మెల్యే జలీల్ఖాన్ తెలిపారు. ఇవాళ ఆయన తన కూతురితో కలిసి చంద్రబాబుతో భేటీ అయిన ఆయన తన కూతురుకు ఎమ్మెల్యే టిక్కెట్కు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని వచ్చే ఎన్నికల్లో టీడీపీ జెండా రెపరెపలాడిస్తామని అన్నారు. మొదటి నుంచి తాను సీఎం అభిమానినని, అమెరికాలోని వర్జీనియాలో టీడీపీ కోఆర్డినేటర్గా ఉన్నానని జలీల్ఖాన్ కూతురు షబానా తెలిపారు. అమెరికా నుంచి తమ కుటుంబం ఏపీకి వచ్చేసిందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి తన వంతు సాయం చేస్తానని స్పష్టం చేశారు. త్వరలో విజయవాడ పశ్చిమలో ప్రచారం ప్రారంభిస్తానని షబానా ఖాతూర్ చెప్పారు.