టీడీపీ ఎమ్మెల్యే అరెస్ట్, విడుదల

Update: 2019-06-05 15:23 GMT

మోదీ, జగన్‌ను దూషించారన్న కేసులో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మోదీ, జగన్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతల ఫిర్యాదుతో వెలగపూడి రామకృష్ణబాబుపై ఎంవీపీ కాలనీ పోలీసు స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన్ను అరెస్టు చేసిన పోలీసులు.. కాసేపటి తర్వాత స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేశారు. 

Tags:    

Similar News