సార్వత్రిక ఎన్నికలు దాదాపుగా ముగిసాయి . ఇక మిగిలింది కేవలం ఫలితాలు మాత్రమే .. ఈ రోజు సాయింత్రం నుండి ఎగ్జిట్ పోల్స్ వెల్లువ మొదలవుతుంది . దానికి తోడు పలు సంస్థల సర్వేలు కూడా ఉంటాయి .. మే 23 వరకు గెలుపు ఓటముల పై హై టేంక్షన్ నడుస్తుంది . అయితే ఇలా టేంక్షన్ తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు రావడం తప్ప మనకి ఒరిగేది ఏమి లేదని నేటిజన్స్ అభిప్రాయపడుతున్నారు .. మే 19 నుండి 23 వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి సోషల్ మీడియాలో ఓ మెసేజ్ తెగ వైరల్ అవుతుంది . ఎగ్జిట్ పోల్స్ మొదలయినప్పటి నుండి ఈ జాగ్రత్తలు తప్పనిసరిని వాళ్ళ ఉద్దేశం ..
1. బీపీ షుగర్ ఉన్నవాళ్లు టిఫిన్ కి ముందు తర్వాత టాబ్లెట్స్ వేసుకోవాలి ..
2. గుండె సంబధిత వ్యాధులు కలిగి ఉన్నవారు సార్బిట్రేట్ టాబ్లెట్స్ ని దగ్గర పెట్టుకోవాలి ..
3. దగ్గరలో ఉన్న మిత్రువులతో తరుచుగా ఫోన్లో మాట్లాడుతూ ఉండాలి ..
4. ఏసీని ఆన్ చేసుకొని కూల్ గా ఉండేలా చూసుకోవాలి
5. దీర్ఘ శ్వాస తీసుకుంటూ ఉండాలి . దీనివల్ల ఒత్తిడి తగ్గించుకునే ఆస్కారం ఉంది .
6. ఎన్నికల ఫలితాలు చూస్తున్నప్పుడు ఒంటరిగా ఉండకూడదు .
7. ఇక చివరగా ఆరోగ్య మాత్రలే తప్ప ఆల్కహాల్ లాంటివి తీసుకోకూడదు ..
మే 19 నుండి 23 వరకు పొలిటికల్ వెదర్ ఓ రేంజ్ లో ఉండబోతుంది కాబట్టి ఇవి పాటించాలని అ మెసేజ్ ముఖ్య ఉద్దేశమంట ..