స్వైన్‌ప్లూ కలకలం

మంచిర్యాల జిల్లాలో స్వైన్‌ ఫ్లూ కలకలం రేపింది. లక్షెట్టిపేటలో ఓ కాలనీకి చెందిన మహిళకు గత 10 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతోంది.

Update: 2019-01-21 11:45 GMT

మంచిర్యాల జిల్లాలో స్వైన్‌ ఫ్లూ కలకలం రేపింది. లక్షెట్టిపేటలో ఓ కాలనీకి చెందిన మహిళకు గత 10 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. దీంతో ఆమెను ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేసినా తగ్గకపోవడంతో ఆమెను కరీంనగర్‌లోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఆమె స్వైన్‌ ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. బ్లడ్‌ శాంపిల్స్‌ను సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి పంపించి వ్యాధిని నిర్ధారించారు. దీంతో ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జిల్లా వైద్య బృందం ఒకటి లక్షెట్టిపేటలోని సదరు కాలనీకి చేరుకుని జ్వరంతో బాధపడుతున్న వారి శాంపిల్స్‌ను సేకరిస్తున్నారు. స్వైన్ ఫ్లూ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు.

Similar News