తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రాబోతున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేఫథ్యంలో రజీనికాంత్ సంచలన ప్రకటన చేశారు. తన రాజకీయ అరేంగేట్రంపై సూపర్ స్టార్ క్లారిటీ ఇచ్చేశారు. అభిమానులకు, తమిళ ప్రజలకు ఎట్టకేలకు రజనీకాంత్ శుభవార్త చెప్పారు. తమిళనాడులో శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని సూపర్స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. చెన్నైలోని తన నివాసం ఎదుట ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కాగా మళ్లీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ మళ్లీ అధికారంలోకి వస్తారా? అని మీడియా రజీనిని ప్రశ్నించగా మే 23న తెలుస్తుంది కదా అని చెప్పారు. తమిళనాడులోని 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 18న అత్యంత కీలకమైన ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఒక వేళ ఈ ఎన్నికల ఫలితాల అనంతరం అన్నాడీఎంకే మెజార్టీ తగ్గితే మాత్రం ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో మరోసారి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడే అవకాశం ఉంది.