పవిత్ర ఈస్టర్ రోజు వరుస బాంబు దాడులతో శ్రీలంక దద్ధరిల్లింది. చర్చిలు, పలు హోటళ్లతో పాటు పలు ప్రాంతాల్లో దాడులకు తెగబడ్డారు. ఈస్టర్ ప్రార్థనలు జరుగుతున్న సమయంలో చర్చిలే లక్ష్యంగా ముష్కర మూకలు రెచ్చిపోయి మారణహోమం సృష్టించాయి. 8చోట్ల జరిగిన దాడుల్లో సుమారు 215మంది చనిపోయారు. 500 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 35మంది విదేశీయులున్నారు. బాంబు పేలుల్ల ఘటనలో పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. మృతుల్లో ముగ్గురు భారతీయులున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. అయితే కోచొకడేలోని సెయింట్ ఆంటోని చర్చిలో జరిగిన పేలుడు ఘటనను కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. దానిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది.
#SriLanka
— Atul Shokeen🛐🇮🇳🇮🇳🇮🇳🇮🇳 (@atul_shokeen) April 21, 2019
A dashcam footage showing the blast which occurred this morning at Kochikade St. Anthony's church.#SriLanka pic.twitter.com/ZrxAxJoyz1