వేసవి సెలవు దినాలు ముగిసినా ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకోవట్లేదు.. ఇల్లందు పట్టణ పరిధిలోని 24 ఏరియా ప్రాథమిక ఉన్నత పాఠశాల మూతపడి ఉండటంతో విద్యార్థులు వెనుదిరుగుతున్నారు. మరోవైపు ప్రైవేట్ పాఠశాలల్లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది.. మొదటి రోజే విద్యార్థులు ఆయాలు, అటెండర్లు అవతారమెత్తుతున్నారు. ప్రియదర్శిని ప్రైవేట్ స్కూల్ కు సంబంధించిన విద్యార్థులు ఉదయాన్నే స్కూలుకు చేరుకుని అటెండర్లు.. ఆయాలు చేయవలసిన పనులు నిర్వహిస్తున్నారు...