మానవత్వం చాటుకున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరాని.. ..

Update: 2019-06-23 06:28 GMT

మానవత్వం చూపించారు కేంద్ర మంత్రి స్మృతి ఇరాని.. లోక్ సభ ఎన్నికల తర్వాత తొలిసారి ఆమె పోటి చేసి గెలిచిన ఆమేధి నియోజకవర్గానికి బయలుదేరారు. కానీ ఆమె వెళ్తుండగా మార్గమధ్యంలో ఓ మహిళా అస్వస్థతకు గురైన విషయాన్ని స్మృతి గుర్తించారు. బాధిత మహిళ నడిచేందుకు తీవ్ర ఇబ్బందులు పడటంతో ఆమెకు ఏమైందని ఆరాతీశారు కేంద్రమంత్రి. రోడ్డుప్రమాదంలో ఆమెకు తీవ్రగాయాలు కావడంతో బాధితురాలు నడవలేకపోవడాన్ని ఆమె గమనించారు. వెంటనే తన కాన్వాయ్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు .. అ తర్వాత ఆమె తన పర్యటనకు బయలు దేరారు .. 



Tags:    

Similar News