శ్రీలంకలో బాంబు పేలుళ్ల ఘటనలో జేడీఎస్ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు మృతి చెందగా మరో ఐదుగురు అదృశ్యమయ్యారు. వీరు ఎన్నికల ప్రచారం అనంతరం ఈ నెల 20న శ్రీలంక వెళ్లినట్లు సీఎం కుమారస్వామి తెలిపారు. వారి వివరాల కోసం ఇండియన్ హై కమిషన్తో సంప్రదింపులు జరిపినట్లు ఆయన తెలిపారు. కొలొంబోలోని ద షాంగ్రిలా హోటల్లో రెండు గదుల్లో బస చేశారు. అదే చోట బాంబు పేలుడు జరిగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. ప్రస్తుతం కనిపించకుండా పోయిన వారి ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.