అమరావతిలో వైఎస్ జగన్ నివాసం వద్ద పోలీసులు భారీ భద్రత కల్పించారు. జగన్ నివాసం, చుట్టుపక్కల ప్రాంతాల్ని ఆధీనంలోకి తీసుకున్నారు. అలాగే జగన్కి కొత్త కాన్వాయ్ కేటాయించారు. AP 18P 3418 నెంబర్తో 6 కొత్త వాహనాలు సిద్ధం చేశారు. వైఎస్ జగన్తో శాఖల వారీగా అధికారుల సమావేశం కొనసాగుతున్నాయి. ఆయా శాఖల అధికారులు జగన్ను పరిచయం చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా కలిసి పనిచేద్దామని అధికారులకు జగన్ తెలిపారు. మరోవైపు జగన్ నివాసానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు తరలివస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత వారితో వైఎస్ జగన్ భేటీ కానున్నారు.