గుంటూరు జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా పడింది. వెల్దుర్తి మండలం మండాది సమీపంలో స్కూల్ బస్సు అదుపుతప్పి బ్రిడ్జి పైనుంచి కింద పడింది. ఈ ప్రమాదంలో 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న ఆరుగురిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదం సమయంలో స్కూల్ బస్సులో మొత్తం 50 మంది విద్యార్థులున్నారు.