వైసీపీ గుర్తింపును ఈసీ రద్దు చేయాలి -కారెం శివాజి

Update: 2019-03-07 05:55 GMT

వైసీపీ అధినేత జగన్‌పై ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ కారెం శివాజీ తీవ్ర విమర్శలు చేశారు. తిరుమల శ్రీవారిని కారెం శివాజీ దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ వైసీపీ గుర్తింపును ఎన్నికల కమిషన్ రద్దు చేయాలని అన్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీతో కలిసి టీడీపీపై జగన్‌ కుట్రలు చేస్తున్నారని, 8 లక్షల ఓట్లు తొలగించాలంటూ వైసీపీ దరఖాస్తులు ఇవ్వడం దారుణమన్నారు. అడ్డదారుల్లో సీఎం అయ్యేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్నాడని శివాజీ అన్నారు.

Similar News