భానుడి ప్రతాపానికి జనాలతో పాటు.. మూగ జీవాలు విలవిలలాడిపోతున్నాయి. ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు పడరాని ఇబ్బందులు పడుతున్నాయి. ఎక్కడైనా నీరు కనబడితే చాలు.. అక్కడ వాలిపోతున్నాయి. జనగామ జిల్లా శివారులో జాతీయ పక్షి నెమలి భానుడి భగభగను తట్టుకోలేకపోయింది. ఓ బోరు వద్ద వస్తున్న నీటి వద్దకు వెళ్లి.. కాసేపు సేదతీరింది. అయినప్పటికీ అది స్పృహ కోల్పోయింది. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలోని అంబులెన్స్ సిబ్బంది ఆ నెమలికి చికిత్స అందించింది. ఆ నెమలికి సెలైన్ ఎక్కించి ఉష్ణతాపం నుంచి ఉపశమనం కలిగించారు.