టీడీపీ గెలుస్తుందనేందుకు వెయ్యి కారణాలున్నాయ్!

Update: 2019-05-22 10:33 GMT

టీడీపీ ఖచ్చితంగా అధికారంలో వచ్చి తీరుతుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి యామిని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీకి ప్రజలు ఎందుకు ఓటు వేశారని చెప్పందుకు తమ వద్ద వెయ్యికారణాలున్నాయని యామిని అన్నారు. వైసీపీకి ప్రజలు ఎందుకు ఓటు వేశారో చెప్పేందుకు జగన్‌ వద్ద కనీసం 10 కారణాలు కూడా లేవని యామిని ఎద్దేవా చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చేస్తుందంటూ వైసీపీ కార్యకర్తలు చేస్తున్న హంగామా హాస్యాస్పదంగా ఉందని యామిని అన్నారు. ఎన్డీయేకు 200 స్థానాలు కూడా రావని చెప్పారు. 23 తర్వాత మోదీ శాశ్వతంగా హిమాలయాలకు వెళ్తారని వ్యాఖ్యానించారు.

Similar News