రైతుబంధు చెక్కుల పంపిణీపై ప్రభుత్వం కీలక ఆదేశాలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు చెక్కుల పంపిణీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రైతుబంధు చెక్కులను యథాతథంగా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

Update: 2019-01-04 07:11 GMT
rythubandhu

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు చెక్కుల పంపిణీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రైతుబంధు చెక్కులను యథాతథంగా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. చెక్కుల పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ రైతుబంధు చెక్కుల పంపిణీ కొనసాగిందని పేర్కొంది. చెక్కుల పంపిణీకి ఇబ్బంది లేకుండా చూడాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం సూచించింది. రైతుబంధు అమలు జరుగుతున్న పథకమని ప్రభుత్వం పేర్కొంది. ఎకరానికి రూ. 4 వేల చొప్పున ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం చేస్తున్న సంగతి తెలిసిందే.

Similar News