'మా' ఎన్నికలపై రకుల్ ఆసక్తికర కామెంట్స్..

Update: 2019-03-10 09:53 GMT

మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ అధ్యక్షుడితో పాటు సభ్యుల ఎంపిక కోసం నిర్వహించిన ఎన్నికల పోలింగ్ ముగిసింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లోని సభ్యులు, సినీ సెలబ్రిటీలంతా తరలవచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ మా ఎన్నికలు చూస్తేంటే భారత ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ ఫైట్‌లా ఉన్నాయన్నారు. నరేష్ ,శివాజీ రాజా ఇద్దరు తమకు కావాల్సిన వాళ్లే అని రకుల్ అన్నారు. మహిళలకు ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మాదాల రవి, జేడీ చక్రవర్తి, సునీల్, అలీ,వేణుమాధవ్, సంజన, శివపార్వతి ఓటు వినియోగించుకున్నారు. ఈ సారి ఎన్నికల్లో మెగా బ్రదర్స్‌ చెరో ప్యానల్‌కు మద్ధతివ్వడంతో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రాత్రి 9 గంటల సమయంలో ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి. ఈ ఎన్నికల్లో ఇరు ప్యానెళ్ల సభ్యుల పోటీపడి హామీలు గుప్పించారు.    

Similar News