ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా కల్యాణదుర్గం సభలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేక హోదా అత్యవసరమని, గత ఎన్నికల్లో ఏపీకి హోదా ఇస్తామని మోడీ మోసం చేశారని ఫైర్ అయ్యారు రాహుల్. ఏపీకి ఇచ్చిన ఏ ఒక్క హామీని మోడీ నెరవేర్చలేదన్నారు. భారత్ను రెండు దేశాలుగా విభజించేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రాణాలు ఇచ్చిందని, భవిష్యత్తో 5 కోట్ల కుటుంబాలకు ఏడాదికి 72వేల రూపాయల సాయం చేస్తామని హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ.