ఈ నెల 17న ఏలూరులో వైఎస్సార్ సీపీ తలపెట్టిన బీసీ గర్జనకు రావలసిందిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యను వైసీపీ నేతలు ఆహ్వానించారు. వైసీపీ బీసీ అధ్యయన కమిటీ ఛైర్మన్ జంగా కృష్ణమూర్తి నల్లకుంటలోని కృష్ణయ్య నివాసానికి చేరుకుని ప్రత్యేకంగా చర్చలు జరిపారు. బీసీల సంక్షేమం కోసం తమ పార్టీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి హజరుకావాలంటూ ఆయన కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కృష్ణయ్య సభకు హాజరవుతానంటూ హామి ఇచ్చారు .