వదిలేది లేదు.. మూల్యం చెల్లించుకోక తప్పదు

Update: 2019-02-15 07:10 GMT

పుల్వామా ఉగ్రదాడి ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా స్పందించారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు త్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు అన్ని వేళలా అండగా నిలుస్తామన్నారు. ఇలాంటి దాడులతో భారతీయ సైనికుల ఆత్మస్ధైర్యాన్ని దెబ్బతీయలేరని ప్రధాని తేల్చి చెప్పారు. భారత సైనిక సామర్ధ్యాలు తెలిసి ఈ స్ధాయి దుస్సహానికి పాల్పడిన వారు భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. ఈ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులతో పాటు వారి వెనకున్న వారికి భారత సైన్యం తగిన గుణపాఠం చెబుతుందన్నారు. ఇలాంటి సమయంలో అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా ఇలాంటి దాడులను ప్రతి ఒక్కరూ ఖండిచాలంటూ పిలుపునిచ్చారు.  

Similar News