పుల్వామాలో కారు బాంబు దాడి ఘటన జరిగిన ప్రాంతంలో ఎన్ఐఏ అధికారులు కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. జైషే సంస్థకు చెందిన కమ్రాన్ ఉగ్రదాడికి పూర్తి ప్లాన్ చేసినట్టు గుర్తించారు. పాక్కు చెందిన అతను గత కొన్నాళ్లుగా పుల్వామా, అవంతిపురా, త్రాల్ ఏరియాల్లో తిరుగుతున్నట్టు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. త్రాల్లోని మిడూరా ప్రాంతంలో ఉగ్రదాడికి ప్లాన్ వేసినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.