ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజ్పథ్ మార్గ్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలు ప్రారంభించారు. రిపబ్లిక్ డే చర్రితలో తొలిసారిగా అస్సాం రైఫిల్స్కు చెందిన మహిళా విభాగం మార్చ్ ఫాస్ట్ నిర్వహించింది. అనంతరం 21 గన్ సెల్యూట్లతో ఆర్మీ గౌరవ వందనాన్ని రాష్ట్రపతి స్వీకరించారు. ఇండియా గేట్ వద్ద ఉన్న అమర్ జవాన్ జ్యోతి వద్ద ప్రధాని మోడీ నివాళులర్పించారు.