టికెట్ రాకుంటే ఇండిపెండెంట్‌గా పోటీచేస్తా: భూమా బ్రహ్మానంద

Update: 2019-03-16 09:51 GMT

కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీలో విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. టికెట్ ఆశిస్తున్న భూమా, ఎస్పీవై రెడ్డి వర్గాలు పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తూ టికెట్ తమకేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే టికెట్ తమకు కేటాయించకపోతే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతానంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి ప్రకటించారు. చంద్రబాబు, భూమా నాగిరెడ్డి ఫోటోలతో ప్రచారం చేస్తానంటూ ఆయన అన్నారు. ఇదే సమయంలో టీడీపీ తరపున టికెట్ తమదేనని ఎస్పీవై రెడ్డి అల్లుడు సజ్జల శ్రీధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే రెండో జాబితాలో నంద్యాల పేరు ఉంటుందా..? ఉంటే అభ్యర్థి ఎవరు..? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

Similar News