ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విష ప్రయోగం జరిగిందేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. నిర్ధారణ కోసం రక్త నమూనాలను విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. మరోవైపు చిగురుపాటి జయరామ్ మేనకోడలు శిఖా చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పారిశ్రామిక వేత్త జయరామ్ మృతి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నాలుగు బృందాలు దర్యాప్తులో పాలుపంచుకుంటున్నాయి. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉన్న జయరామ్ ఇంటికి నందిగామ పోలీసులు చేరుకున్నారు. ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీ టీవీ పుటేజీని దర్యాప్తు బృందం పరిశీలించింది.