నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మద్దతు ధర కోసం ఆందోళన చేపట్టిన పసుపు, ఎర్ర జొన్న రైతులను పోలీసులు అర్ధరాత్రి సమయంలో బలవంతంగా అరెస్టు చేశారు. సుమారు 13గంటల సేపు హైవేను దిగ్బంధించడంతో అర్ధరాత్రి 2గంటల సమయంలో పోలీసులు రైతులను అరెస్ట్ చేశారు. రైతుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఇవాళ ఆందోళనలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.