పక్షపాతం లేకుండా సభను హుందాగా నడిపించాల్సిన బాధ్యత తనపై ఉందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నియమ నిబంధనల ప్రకారం సభలో ప్రతిపక్షపార్టీలకు మాట్లాడే స్వేచ్ఛనిస్తానన్నారు. ప్రతిపక్షాల సూచనలు, సలహాలు స్వీకరించి సభ సంప్రదాయాలను పాటిస్తానని స్పీకర్ తెలిపారు. అసెంబ్లీ ఆవరణలోని గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు స్పీకర్ పోచారం పూలమాల వేసి నివాళులర్పించారు.