అసెంబ్లీ స్పీకర్‌గా పోచారం శ్రీనివాసరెడ్డి?

Update: 2019-01-17 06:01 GMT
Pocharam

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా పోచారం శ్రీనివాసరెడ్డి పేరు దాదాపు ఖరారయ్యింది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో సీనియర్‌ నేతలు పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి భేటీ అయ్యారు. స్పీకర్‌ ఎన్నికపై చర్చించారు. ఇద్దరి అభిప్రాయాలు తెలుసుకున్న సీఎం పోచారం వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. మరికొద్దిసేపట్లో ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం జరగనుంది. ఇలా ఉండగా స్పీకర్ గా మాజీ వ్యవసాయ మంత్రిగా పనిచేసిన పోచారం శ్రీనివాసరెడ్డి నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Similar News