తెలంగాణ స్పీకర్గా పోచారం శ్రీనివాస్రెడ్డి...కాసేపట్లో ఏకగ్రీవ ఎన్నిక...
తెలంగాణ రెండో శాసనసభకు స్పీకర్గా పోచారం శ్రీనివాస్రెడ్డి ఎన్నిక కానున్నారు. నిన్న ఆయన సీఎం కేసీఆర్తో కలిసి నామినేషన్ వేశారు. అన్ని పార్టీలకు చెందిన నాయకులు మద్దతు తెలపడంతో ఆయన ఎన్నిక లాంఛనంగా మారనుంది. కాసేపట్లో పోచారం శాసనసభాపతిగా ఎన్నుకున్నట్లు అధికారిక ప్రకటన వెలువడనుంది. రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే పోచారంను స్పీకర్ స్థానంలో ఆసీనులు కానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి మేరకు ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు స్పీకర్ బరి నుంచి తప్పుకున్నాయి. దీంతో పోచారం ఎన్నిక ఏకగ్రీవంగా మారింది.