హన్మకొండ నయీమ్ నగర్లో దారుణం జరిగింది. డిగ్రీ విద్యార్థిని రవళిపై ప్రేమోన్మాది అన్వేష్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ప్రేమ నిరాకరించిందనే కారణంతో నడిరోడ్డుపైనే ఈ అమానుషానికి ఒడిగట్టాడు. అడ్డుకున్నవారిని దుండగుడు బెదిరించాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని రవళిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలిది వరంగల్ రూరల్ జిల్లా సంగెము మండలం రామచంద్రపురం. రవళి వాగ్దేవి కాలేజీలో బిఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతోంది.