ఇటీవల మృతి చెందిన ఎస్పీవై రెడ్డి కుటుంబాన్ని జనసేన అధినేత పవన్ పరామర్శించారు. నంద్యాలలోని ఎస్పీవై రెడ్డి కుటుంబాన్ని కలిశారు. ఆయన కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ఇచ్చారు. ఎస్పీవై రెడ్డి గత నెల 30న హైదరాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. ఎస్పీవై రెడ్డి మృతి చెందిన రోజు విదేశీ పర్యటనలో ఉండటంతో పవన్ రాలేకపోయారు. ఈ నేపథ్యంలోఎస్పీవై రెడ్డి కుమార్తె సుజల, అల్లుడితో కాసేపు పవన్ మాట్లాడారు. ఎస్పీవై రెడ్డి సమాధి వద్ద పవన్ నివాళులర్పించారు.