పొత్తు యత్నాలపై పవన్ సంచలన కామెంట్స్..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. జనసేన పార్టీతో పొత్తుకోసం వైసీపీ నేతలు తెగ యత్నిస్తున్నారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

Update: 2019-01-11 15:44 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. జనసేన పార్టీతో పొత్తుకోసం వైసీపీ నేతలు తెగ యత్నిస్తున్నారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అసలు ఏపీలో జనసేన పార్టీకి బలం లేదంటునే రాయబరాలు నడిపిస్తున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. అయితే టీఆర్ఎస్ నేతలతో జనసేన పార్టీతో మాట్లాడిస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నేడు విజయవాడలో ఏర్పాటు చేసిన జనసేన కార్యకర్తల సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. ఎవరు ఎన్ని చేసిన కాని జనసేన లక్ష్యాన్ని ఎవరు అపలేరని, జనం కోసం జనసేన పనిచేస్తుందని పవన్ అన్నారు.

Similar News