నూజివీడు ఎన్నికల ప్రచారం జనసేన అధినేత పవన్ వైసీపీ అధినేత జగన్ను టార్గెట్ చేశారు. జగన్ లాగా తాను కేసీఆర్ కనుసన్నల్లో పని చేసే వ్యక్తిని కాదన్నారు. ఏపీలో వైసీపీని గెలిపిస్తే టీఆర్ఎస్ను గెలిపించినట్టేనని అన్నారు. జనసేన అధికారంలోకి వస్తే.. చంద్రన్న, జగనన్న లాంటి పథకాల స్థానంలో డొక్కా సీతమ్మ, కందుకూరి, కాటన్ దొర, అంబేడ్కర్ వంటి మహానీయుల పేర్లు పెడతామని చెప్పారు. తన పేరుపై భవిష్యత్తులో ఒక్క పథకం పేరు కూడా ఉండబోదని చెప్పారు. డబ్బుతో సంబంధం లేని రాజకీయాలు చేద్దాం రండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.