అభినందన్‌‌ను ఏ సమయంలో విడుదల చేస్తారో ప్రకటించిన పాక్

Update: 2019-03-01 06:54 GMT

భారత పైలట్ అభినందన్ వర్థమాన్‌ను మధ్యాహ్నం విడుదల చేస్తామని పాక్ విదేశాంగ మంత్రి మహ్ముద్ ఖురేషి ప్రకటించారు. వాఘ్రా సరిహద్దు వద్ద అభినందన్‌ను భారత్‌కు అప్పగించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దీంతో ఇప్పటికే అక్కడికి అభినందన్‌ తల్లిదండ్రులతో పాటు.. స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అతనికి స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. దేశ ప్రజలంతా ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో వాఘా దగ్గర ఉద్విఘ్న భరితమైన వాతావరణం నెలకొంది.  

Similar News