సరిహద్దుల్లో రెచ్చిపోతున్న పాకిస్తాన్...పాక్ సైన్యానికి ధీటుగా జవాబిస్తున్న భారత్

Update: 2019-02-21 05:22 GMT

సరిహద్దుల్లో పాకిస్తాన్ రెచ్చిపోతోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి దాయాది దేశం దుందుడుకుగా వ్యవహరిస్తోంది. రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడుతోంది. నౌషెరా సెక్టార్‌ సరిహద్దు వెంట ఇండియన్ ఆర్మీ పోస్టులపై తెల్లవారుజాము నుంచి పాక్ జవాన్లు మోర్టార్లతో నిరంతరాయంగా కాల్పులు జరుపుతున్నారు. భారత ఆర్మీ పోస్టులే లక్ష్యంగా జరుపుతున్న కాల్పుల్ని మన సైన్యం సమర్ధవంతంగా తిప్పికొడుతోంది.

పుల్వామా ఆత్మాహుతి దాడి తర్వాత పాకిస్తాన్ ప్రవర్తన రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచుతోంది. రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ సరిహద్దుల్లో పాకిస్తాన్ జరుపుతున్న కాల్పులతో వాతావరణం మరింత వేడెక్కించేలా చేస్తోంది. అయితే పాక్ జవాన్లు జరుపుతున్న కాల్పుల్లో మన సైన్యానికి ఎలాంటి నష్టమూ జరగలేదని ఆర్మీ వర్గాల తెలిపాయి. 

Similar News