పసిపిల్ల అని మరిచాడు .. సొంత మనవరాలు పైన అఘాయిత్యం

Update: 2019-06-06 06:49 GMT

మనవరాలుకి కధలు చెప్పాల్సిన ఓ తాత తన మనవరాలు పైనే కామంతో కళ్లుమూసుకుపోయి కన్నేసాడు .సున్నపుబట్టీ గ్రామం పాతూరు గిరిజన కాలనీలో ఉప్పు వెంకటేశ్వర్లు కుటుంబాలు నివాసముంటున్నారు. అయితే వేంకటేశ్వర్లు తన భార్య రమణమ్మతో ఒక ఇంట్లో నివసిస్తుండగా.. అతని కుమార్తె కందల మంగమ్మ కుటుంబంతో మరో ఇంట్లో ఉంటోంది. అతడి కన్ను తన మనవరాలిపై పడింది. అదను కోసం ఎదురుచూశాడు.

అవకాశం రాగానే తన మనవరాలు పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు .. ఆమె ప్రతిఘటించడంతో తలపై బలంగా కొట్టాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలికను రేప్ చేశాడు. దీంతో బాలిక చనిపోయింది. వెంకటేశ్వర్లు ఎవరికీ అనుమానం రాకుండా ఆమె ఉరి వేసుకున్నట్లు చిత్రీకరించాడు. అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి చెందినట్లు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు వెంకటేశ్వర్లుని తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో అసలు విషయం బయటపెట్టాడు. మనవరాలిని చంపేసి చున్నీతో దూలానికి బిగించి ఆత్మహత్యగా చిత్రీకరించానని ఒప్పుకున్నాడు. ఆ చున్నీని కోయడానికి కత్తిని వాడానని చెప్పాడు. వెంకటేశ్వర్లుని అరెస్టు చేసిన పోలీసులు అతన్ని రిమాండ్‌కు పంపారు. 

Tags:    

Similar News