నిజామాబాద్లో నామినేషన్ల ఉపసంహరణకు రైతులు ససేమిరా అంటున్నారు. రైతులు నామినేషన్లు వెనక్కి తీసుకుంటే లక్ష జరిమానా విధిస్తామని గ్రామాభివృద్ధి కమిటీల తీర్మానం చేశాయి. మరికొన్నిచోట్ల గ్రామ బహిష్కరణ చేస్తామంటున్న గ్రామాభివృద్ధి కమిటీలు హెచ్చరిస్తున్నాయి. మరోవైపు, నామినేషన్లు విత్ డ్రా చేసుకోవాలని అధికార పార్టీల నేతలు రైతులపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో నామినేషన్లు దాఖలు చేసిన రైతులు ఆందోళనలో ఉన్నారు.