నిమ్స్ డాక్టర్పై దాడి ఘటనలో ట్విస్ట్ వెలుగుచూసింది. ఎవరైతే ఓ మంత్రి కుమారుడి అనుచరులు నిమ్స్ ఆసుపత్రిలో డాక్టర్పై దాడి చేశారో వారు అంతకు ముందు సికింద్రాబాద్లో తాగి వాహనం నడిపినట్టు గుర్తించారు. అయితే ఈ క్రమంలో వారు ఓ బైక్ను ఢీకొట్టారు. దీంతో గాయపడిన నిఖిల్ అనే వ్యక్తిని అనుచరులు నిమ్స్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే డాక్టర్ చికిత్స అందించడంలో ఆలస్యమవ్వడంతో వైద్య సిబ్బందితో గొడవకు దిగారు. వారిని దుర్భాషలాడి, దాడికి పాల్పడ్డారు మంత్రి కుమారుడి అనుచరులు.