నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చెరుకుపల్లిలో ఉద్రిక్తత

Update: 2019-05-26 05:08 GMT

నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చెరుకుపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. రెండు రోజులుగా సర్పంచ్ బసు ప్రసాద్ వర్గం, బంటు మహేందర్ వర్గాల మధ్య దాడులు జరుగుతున్నాయి. కట్టెలు, కత్తులతో దాడులు చేసుకుంటూ గ్రామంలో తిరుగుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నిన్న రాత్రి రమేష్ అనే వ్యక్తిపై దాడి చేయడంతో అతడిని నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు.

Similar News