తెలంగాణ కాంగ్రెస్కు ఊహించని షాక్ ...కోమటిరెడ్డి బ్రదర్స్కు హ్యాండిచ్చిన...
తెలంగాణ కాంగ్రెస్కు మరో షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ను వీడాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇప్పటికే మంత్రి జగదీశ్వర్ రెడ్డితో భేటి అయిన ఆయన తాజాగా సీఎం కేసీఆర్తోనూ భేటి అయ్యారు. రాష్ట్ర భవిష్యత్ దృశ్యా టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని కేసీఆర్కు వివరించారు. కాంగ్రెస్లో కీలక స్ధానంలో ఉన్న కోమటి రెడ్డి బ్రదర్స్కు ప్రధాన అనుచరుడుగా ఉన్న చిరుమర్తి లింగయ్య పార్టీ మార్పడం తీవ్ర సంచలనంగా మారింది.