వేములవాడ రూరల్ మండల ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది. వేములవాడ రూరల్లో రిజర్వేషన్ల ప్రక్రియ పునర్ పరిశీలించిన తర్వాత ఎన్నికలు జరపాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఎంపీటీసీ రిజర్వేషన్ల ప్రక్రియ 2011 జనాభా ప్రాతిపదికన జరగలేదని వేములవాడ ఎంపీపీ రంగు వెంకటేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపున తీగల రాంప్రసాద్ హైకోర్టులో వాదనలు వినిపించారు. వాదనలు విన్న హైకోర్టు ఎంపీటీసీ ఎన్నికలపై స్టే విధించింది.