పరిషత్‌ పోరుకు నేడు మరో నగారా

Update: 2019-04-22 04:46 GMT

తెలంగాణ ఎంపీటీసీ, జెడ్పీటీసీ తొలివిడత ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. ఇవాళ్టి నుంచి 24వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 25న పరిశీలన, 26న అభ్యంతరాల స్వీకరణ, 26 నుంచి 28 వరకు ఉపసంహరణకు అవకాశం కల్పించారు. మే 6న మొదటి విడత పోలింగ్‌ జరగుతుంది. మే 27న ఫలితాలు ప్రకటిస్తారు. అయితే తొలిసారి నామినేఫన్ల ప్ర్రక్రియను ఆన్ లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు.  

Similar News