మధ్యప్రదేశ్లో ఓ పోలీస్ కానిస్టేబుల్ మానవత్వాన్ని చాటుకున్నాడు. గాయపడిన ఓ వ్యక్తిని సకాలంలో ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడాడు. గాయపడిన చోట నుంచి ఆసుపత్రికి చేరడానికి వాహనాలు అందుబాటులో లేకపోవడంతో తన భుజాలపై మోసుకువెళ్లాడు. దాదాపు కిలోమీటర్పైగా గాయపడిన వ్యక్తిని మోసుకువెళ్లాడు. పరుగు లాంటి నడకతో వేగంగా ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. సకాలంలో హాస్పిటల్కి చేర్చడంతో ఆ గాయపడిన వ్యక్తికి మెరుగైన చికిత్స లభించింది.