తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు...3 రోజులు...

Update: 2019-05-29 09:08 GMT

వేసవి తాపానికి అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని కబురు తెలిపింది భారత వాతావరణ శాఖ. మూడు రోజుల ముందుగానే రుతుపవనాలు దక్షిణాదిని తాకనున్నాయి ఈ ప్రభావంతో ఈసారి త్వరగానే వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెప్పారు. జూన్ 6వ తేదీ నాటికి రుతుపవనాలు రానున్నాయని భావించినా ఇప్పుడు మరో మూడు రోజులు ముందుగా, సుమారు జాన్ 3 నాటికి రుతుపవనాలు దక్షిణాదిని పలకరిస్తాయని వాతావరణ శాఖ అంటోంది. ముందుగా పలకరించనున్న నైరుతి రుతుపవనాల కారణంగా దక్షిణాది రాష్ట్రాలలో వర్షాలు కురవనున్నాయి.

అంచనాలకు భిన్నంగా ఈసారి కాస్త ముందుగానే నైరుతి రుతుపవనాలు అండమాన్‌ను తాకాయి. ఏటా మే 20 నాటికి అండమాన్‌ను తాకే నైరుతి రుతుపవనాలు ఈసారి మే 18 నాటికే వచ్చాయి. ప్రస్తుతం రుతుపవనాలు తమిళనాడు, దక్షిణ సరిహద్దు కర్ణాటక నుంచి కొమెరిన్‌ వరకు విస్తరించి ఉన్నాయి. రెండు రోజుల్లో కేరళతో పాటు కర్నాటక దక్షిణ సరిహద్దుల్లో భారీ నుండి మోస్తరు వర్షాలు కురుసే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలో కేరళ తీరాన్ని తాకనున్నాయని భావించినా మరో మూడు రోజులు ముందుగానే కేరళను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

Similar News