తనపై వస్తున్న పుకార్లను కొట్టిపారేసిన మోహన్ బాబు ...

Update: 2019-06-05 05:50 GMT

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తనపై వస్తున్నా పుకార్లను కొట్టిపారేసారు మోహన్ బాబు .. తాను ఎలాంటి పదవులు ఆశించిన రాజకీయాల్లోకి రాలేదని టీటీడీ చైర్మన్‌ రేసులో ఉన్నట్టుగా వస్తున్న పుకార్లు అబద్దమని అన్నారు ..

నేను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ రేసుల్లో ఉన్నట్టుగా వార్తలు, ఫోన్‌ కాల్స్ వస్తున్నాయి. నా ఆశయం వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడటం. అందుకోసం నా వంతుగా కష్టపడ్డాను. నేను తిరిగి రాజకీయాల్లోకి రావడానికి కారణం వైఎస్‌ జగన్‌ ప్రజల ముఖ్యమంత్రి అవుతాడన్న నమ్మకమే గాని ఎలాంటి పదవులు ఆశించి కాదు. మీడియాకు నా విన్నపం పుకార్లను ప్రోత్సహించకండి' అంటూ మోహన్‌ బాబు ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

Tags:    

Similar News