ఏపీ సర్కార్‌పై మోహన్ బాబు సంచలన ఆరోపణలు

Update: 2019-03-02 07:29 GMT

ఏపీ సర్కార్ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు మోహన్ బాబు. 2014-2015 నుండి విద్యానికేతన్ విద్యార్థులకు ఏపీ సర్కార్ ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించడం లేదంటూ మోహన్ బాబు ఆరోపించారు. కాగా ఇదే విషయంపై ఏపీ ప్రభుత్వానికి లేఖలు రాసినా కానీ ఇప్పటి వరకు స్పందించలేదని బాబు సర్కార్‌ను దుయ్యబట్టారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారని తీవ్రస్థాయిలో విమర్శించారు. విద్యాభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా చిత్తశుద్ది లేదని మండిపడ్డారు. ఆనాడు ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ఇంటింటీకి తిరిగి.. అసలు అమలు కాని హామీలేందుకు ఇస్తున్నారు అని ప్రశ్నించారు. తాను ఏ ఒక్క పార్టీకి చెందిన వ్యక్తిని కాదని, అసలు ఏ పార్టీయో చెబితే తాను ఇలా మాట్లాడడం లేదని మోహన్ బాబు స్పష్టం చేశారు.

Similar News