ఏపీలో జగన్ గెలుపు ఖాయం : మోహన్‌బాబు

Update: 2019-03-26 07:39 GMT

సినీనటుడు మోహన్‌బాబు వైసీపీలో చేరారు. మంగళవారం తన కుమారుడు మంచు విష్ణుతో కలసి లోటస్‌ పాండ్‌లో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసానికి చేరుకున్న మోహన్‌బాబు ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌, మోహన్‌ బాబుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పదవుల కోసం తాను వైసీపీలో చేరలేదని మోహన్‌బాబు చెప్పారు. ఏపీలో జగన్ గెలుపు ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌లు పాల్గొన్నారు.  

Similar News