ఏపీలో ఈసారి చంద్రబాబు దారుణంగా ఓడిపోతారని, ఇది 100 శాతం గ్యారెంటీ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోస్యం చెప్పారు. చంద్రబాబు నిద్రలో కూడా కేసీఆర్నే కలవరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో ఐటీ దాడులు జరిగితే చంద్రబాబు ఎందుకు ఉలిక్కి పడుతున్నారన్న కేటీఆర్ వాళ్లేమైనా మీ బినామీలా అంటూ ప్రశ్నించారు. మీడియా చిట్చాట్లో చంద్రబాబును ఏకిపారేసిన కేటీఆర్ ఢిల్లీలో కాదు విజయవాడ గల్లీలో కూడా చంద్రబాబు చక్రం తిప్పలేరంటూ సెటైర్లు వేశారు.
ఢిల్లీలో కాదు విజయవాడ గల్లీలో కూడా చంద్రబాబు చక్రం తిప్పలేరంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈసారి వైసీపీ విజయం ఖాయమన్నారు. ఆంధ్రా ప్రజల్ని చంద్రబాబు మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని, కానీ వంద శాతం ఓడిపోతారంటూ జోస్యం చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ, యూపీఏల్లో దేనికీ మెజారిటీ రాదన్న కేటీఆర్ జగన్తో కలిసి కేంద్రంలోనూ కీలక పాత్ర పోషిస్తామన్నారు.