సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వృద్ధులను, మహిళలను పెన్షన్, పసుపు కుంకుమ పేరుతో మోసం చేస్తున్నాడని అన్నారు. డబ్బులు పంపిణీ చేసి ఓట్లు అడగటం సిగ్గుచేటని అన్నారు. ఢిల్లీ ధర్నా పేరుతో 10కోట్లు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్యాకేజీ కోసం చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని, వైఎస్ జగన్ కారణంగా హోదా పోరాటం ఇంకా కొనసాగుతోందని ఆమె వ్యాఖ్యానించారు.